పినపాక, కరకగూడెం మండలాలకు మహర్దశ

ABN , First Publish Date - 2021-03-25T05:13:18+05:30 IST

పినపాక నియోజకవర్గంలోని పూర్తి ఏజెన్సీ మండలాలైన పినపాక కరకగూడెం మండలాల అభివృద్ధి పనులకు మహర్దశ పట్టనుంది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కృషితో ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.

పినపాక, కరకగూడెం మండలాలకు మహర్దశ

 విప్‌ రేగా కాంతారావు కృషితో నిధులు మంజూరు

 పినపాక, మార్చి 24 : పినపాక నియోజకవర్గంలోని పూర్తి  ఏజెన్సీ మండలాలైన పినపాక కరకగూడెం మండలాల అభివృద్ధి పనులకు మహర్దశ పట్టనుంది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు కృషితో ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పలు అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’తో బుధవారం ఆయన ఫోన్‌లో సంభాషించారు. ఈ రెండు మండలాల్లో దాదాపు రూ,6 కోట్ల 17.4 లక్షల అభివృద్ధి పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలిచి, ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో నిధులు మంజూరైన పనుల వివరాలను వెల్లడించారు. పినపాక మండలం బోటిగూడెం పంచాయతీ మారేడుగూడెం బ్రిడ్జి నిర్మాణానికి రూ, 30 లక్షలు , బయ్యారం - బెస్తగూడెం రహదారి పనులకు రూ, 3 కోట్ల 11 లక్షలు, కరకగూడెం మండలంలోని ముంకుటి వర్రెకు రూ.1 కోటి 24 లక్షలు, వట్టివాగుపై రూ.2 కోట్ల 52 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏజెన్సీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. త్వరలోనే పనులన్నింటికి టెండర్లు పిలవడం జరుగుతుందని, ఏప్రిల్‌ 15 తర్వాత పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-03-25T05:13:18+05:30 IST