ఖమ్మం జిల్లాల్లో ముగ్గురికి కరోనా
ABN , First Publish Date - 2021-10-21T05:22:04+05:30 IST
ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.

ఖమ్మం కలెక్టరేట్, అక్టోబర్ 20: ఖమ్మం జిల్లాలో బుధవారం మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 4,943మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో బుధవారం నలుగురు చేరారు. ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుం 24మంది చికిత్స పొందుతున్నారు. 296 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.