స్పాంజ్ ఐరన్ విస్తరణకు సహకరించండి
ABN , First Publish Date - 2021-07-27T05:00:13+05:30 IST
వసాన దశకు చేరుకున్న పాల్వంచలోని ఎన్ఎండీసీ అనుబంధ స్పాంజ్ఐరన్ కర్మాగారాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడ కోనేరు సత్యనారాయణ(చిన్ని) కోరారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని వినతి
పాల్వంచ, జులై26: అవసాన దశకు చేరుకున్న పాల్వంచలోని ఎన్ఎండీసీ అనుబంధ స్పాంజ్ఐరన్ కర్మాగారాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడ కోనేరు సత్యనారాయణ(చిన్ని) కోరారు. ఈమేరకు స్పాంజ్ఐరన్లోని కార్మిక సంఘాల నాయకులతో కలిసి చిన్ని సోమవారం ఢిల్లీలోని శాస్ర్తీ భవన్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 1979లో ఏర్పాటైన కర్మాగారం ఆసియాలోనే అనేక అవార్డులు సాధించిందని గుర్తుచేశారు. ఐరన్ఓర్ను కనీస ధరకు స్పాంజ్ఐరన్కు అప్పగిస్తే సంస్థ లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ల నాయకులు బాణోత్ బాలూనాయక్, అల్లికాంతయ్య, రామగిరి రవి, సాగర్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.