ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-12-31T05:48:38+05:30 IST
ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
![ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, డిసెంబరు 30: ఉమ్మడి జిల్లాలో గురువారం నలుగురు కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 3,011 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, భద్రాద్రి జిల్లాలో 649మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. 320 పడకలున్న ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో గురువారం ఒకరు చేరారు. ప్రస్తుతం తొమ్మిది మంది చికిత్స పొందుతుండగా 311 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.