ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2021-12-30T06:25:44+05:30 IST
ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
![ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్,డిసెంబరు 29: ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 3,021మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో 688మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. 320 బెడ్లున్న ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో బుధవారం ఎవరూ చేరలేదు. ఒకరు డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. 314 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.