ఖమ్మం జిల్లాలో ఇద్దరికికరోనా

ABN , First Publish Date - 2021-12-19T06:13:49+05:30 IST

ఖమ్మం జిల్లాలో ఇద్దరికికరోనా

ఖమ్మం జిల్లాలో ఇద్దరికికరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 18: ఖమ్మం జిల్లాలో శనివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,356మందికి పరీక్షలు నిర్వహించగా రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 651మందికి పరీక్షలు నిర్వహించగా ఎవ్వరికీ పాజిటివ్‌ రాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో శనివారం ఎవరూ చేరలేదు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. 312బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-12-19T06:13:49+05:30 IST