ఖమ్మం జిల్లాలో ఇద్దరికి కరోనా
ABN , First Publish Date - 2021-11-28T06:31:03+05:30 IST
ఖమ్మం జిల్లాలో ఇద్దరికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, నవంబరు 27: ఖమ్మం జిల్లాలో శనివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 4,017 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 507మందికి పరీక్షలు నిర్వహించగా.. ఎవ్వరికీ పాజిటివ్ నమోదుకాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో శనివారం ఎవరూ చేరలేదు. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 8మంది చికిత్స పొందుతున్నారు. 312 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.