ఇరు జిల్లాల్లో 13మందికి కరోనా

ABN , First Publish Date - 2021-11-21T06:33:21+05:30 IST

ఇరు జిల్లాల్లో 13మందికి కరోనా

ఇరు జిల్లాల్లో 13మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 20: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం 13కరోనా పాజిటివ్‌కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,072మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 721మందికి పరీక్షలు నిర్వహించగా 8పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లోని కొవిడ్‌ వార్డులో శనివారం ఎవ్వరూ చేరలేదు. ఒకరు కోలుకొని డిశ్చార్జ్‌ అవ్వగా, ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 10మంది చికిత్స పొందుతున్నారు. 310బెడ్లు ఖాళీగా ఉన్నాయి.  

Updated Date - 2021-11-21T06:33:21+05:30 IST