బీటీపీఎస్ నాలుగో యూనిట్ లైటప్
ABN , First Publish Date - 2021-04-17T06:21:32+05:30 IST
బీటీపీఎస్ నాలుగో యూనిట్ లైటప్
త్వరలోనే సింక్రనైజేషన్ నిర్వహిస్తాం : సీఈ బాలరాజు
మణుగూరు, ఏప్రిల్ 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 4వ యూనిట్ బాయిలర్ లైటప్ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. యూనిట్ బాయిలర్ను లైటప్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన బీటీపీఎస్ సీఈ బాలరాజు మాట్లాడుతూ త్వరలోనే నాలుగో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తి చేసుకునిసీవోడీకి వెళ్తామన్నారు. కార్యక్రమంలో ఐవీఎల్ కోటేశ్వరరావు, ఎస్ఈ మహేందర్, టీఏపీఏఎస్ జీఎం వైఎం బాబు, బీహెచ్ఈఎల్ డీవైజీఎం రంజిత్పాల్, తదితరులు పాల్గొన్నారు.