ఐదుగురు న్యూడెమోక్రసీ నేతల అరెస్టు
ABN , First Publish Date - 2021-02-23T05:29:48+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు ్ఞ్డఅటవీప్రాంతంలో సోమవారం సాయంత్రం ఐదుగురు న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) నాయకులను అరెస్టు చేసినట్టు ఇల్లందు సీఐ బరపాటి రమేష్ తెలిపారు.
ఇల్లందు, ఫిబ్రవరి 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు ్ఞ్డఅటవీప్రాంతంలో సోమవారం సాయంత్రం ఐదుగురు న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) నాయకులను అరెస్టు చేసినట్టు ఇల్లందు సీఐ బరపాటి రమేష్ తెలిపారు. న్యూడెమోక్రసీ మాజీ దళకమాండర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్డీ నాయకుడు సాగర్(అలియాస్ చంద్రారెడ్డి)తో పాటు ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు రవి.. సోమవారం మసివాగు అటవీప్రాంతంలో సంచరిస్తూ గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు తారసపడటంతో అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. వారితో పాటు నూతనంగా నక్సలైట్ దళాల్లో చేరేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన సంద్యల రాజేష్, మహబూబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన రావుల సోమన్న, ఆలేరుకు చెందిన సుంకరి సంపత్లను కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి నుంచి 8ఎంఎం రివాల్వర్కు సంబంధించిన ఎనిమిది తూటాలను, విప్లవసాహిత్యాన్ని, మెడికల్ కిట్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. అరెస్టు అయిన ఐదుగురు న్యూడెమోక్రసీ నాయకులకు సోమవారం రాత్రి ఇల్లందు ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరిక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచేందుకు తరలించారు.