రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-06-18T05:11:15+05:30 IST
కొణిజర్ల మండల పరిధిలోని శాంతినగర్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆటో డీకొట్టిగా మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.
కొణిజర్ల, జూన్17: కొణిజర్ల మండల పరిధిలోని శాంతినగర్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆటో డీకొట్టిగా మహిళ మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ మాచినేని రవి తెలిపిన వివరాలు ప్రకారం కృష్ణాజిల్లా, గంపలగూడెం మండలం, చల్లగూండ్లవారి గ్రామానికి చెందిన పదిరాజు నాగబ్రహ్మచారి, పదిరాజు జ్యోతి(41) దంపతులు ఖమ్మం వైపు నుంచి వారి స్వగ్రామానికి ద్విచక్రవాహనం పై వెళ్లుతుండగా శాంతినగర్ సమీపంలో ఆటో డీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం క్రిందపడగా భార్యభర్తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సమీపంలోనే వైరాలో గల ప్రవేటు ఆసుపత్రికి తరలించగా పదిరాజు జ్యోతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాగబ్రహ్మాచారి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.