294 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-07-27T04:36:30+05:30 IST
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 8,876మందికి పరీక్షలు నిర్వహించగా
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం కలెక్టరేట్, జులై 26: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 294 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 8,876మందికి పరీక్షలు నిర్వహించగా 240 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,400మందికి పరీక్షలు నిర్వహించగా 54మందికి పాజిటివ్ వచ్చింది. అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన మహిళ(45) కరోనాతో మృతిచెందారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో సోమవారం 12మంది చేరారు. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 120మంది చికిత్స పొందుతున్నారు. 200బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో సోమవారం 5,259 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 609మందికి రెండోడోస్ వాక్సిన్ అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,510మంది వ్యాక్సిన తీసుకొన్నారు. కొవిషీల్డ్ 2వ డోస్ 40మంది తీసుకొన్నారు.