పొన్న వాహనంపై వేంకటేశ్వరుడి దర్శనం
ABN , First Publish Date - 2021-10-20T06:07:13+05:30 IST
సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మహిళల కోలాటం, దాండియా ఆటల మధ్య పొన్న శావపై స్వామివారు దర్శనమిచ్చారు.

సిరిసిల్ల ఎడ్యుకేషన్, అక్టోబరు 19: సిరిసిల్ల లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మహిళల కోలాటం, దాండియా ఆటల మధ్య పొన్న శావపై స్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. శావ ముందు భక్తులు గోవిందా నామ స్మరణన చేస్తూ నృత్యం చేశారు. మహిళలు అడుగడుగునా స్వామివారికి మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.