రాజన్న సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2021-04-14T06:13:29+05:30 IST
ఉగాది పర్వదినం సందర్భం గా పలువురు ప్రముఖులు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడ, ఏప్రిల్ 13:ఉగాది పర్వదినం సందర్భం గా పలువురు ప్రముఖులు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు.