ప్రజల సహకారంతోనే పట్టణాభివృద్ధి
ABN , First Publish Date - 2021-06-19T05:55:09+05:30 IST
ప్రజల సహకారంతోనే జగిత్యాల పట్టణా భివృద్ధి సాధ్యమౌతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నా రు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, జూన్ 18 : ప్రజల సహకారంతోనే జగిత్యాల పట్టణా భివృద్ధి సాధ్యమౌతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 23, 24 వార్డుల్లో రూ. 17 లక్షల నిధులతో నిర్మిం చనున్న సీసీరోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించా రు. అనంతరం ఎమ్మెల్యే, చైర్ పర్సన్లు మట్లాడుతూ పారిశుధ్య సమ స్య తీర్చేందుకు గాను నూతనంగా ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేశా మ ని, డంపింగ్ యార్టు కోసం 15 ఎకరాలు కేటాయించామన్నారు. ప్రజలు తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి చెత్త తరలించే సిబ్బం దికి ఇవ్వాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబ లే అవకాశం ఉందని ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేసేవారిని గుర్తించి జరిమా నాలు విధించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, కమిషనర్ మారుతీ ప్రసాద్, కౌన్సిలర్లు జుంబర్తి రాజ్కుమార్, గుర్రం రమేష్, నాయకులు గట్టు సతీష్, పృథ్వీద ర్, అరుముల్ల పవన్, కోఠేశ్వర్రావు, ఆనందరావు, డీఈ లచ్చిరెడ్డి తదిత రులు ఉన్నారు.
అనంతరం 10 వార్డులో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించి తన ప్రగాడ సానుభూతిని తె లియజేశారు. కౌన్సిలర్ సిరికొండ భారతి, నాయకులు రాజయ్య, చిరం జీవి, నరేష్, నర్సయ్య, మల్లిఖార్జున్ నవీన్ ఉన్నారు.