దొరల చేతిలో బంధీగా తెలంగాణ
ABN , First Publish Date - 2021-06-22T06:13:42+05:30 IST
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బంధీగా మారి రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగు తోందని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు.
![దొరల చేతిలో బంధీగా తెలంగాణ](https://media.andhrajyothy.com/appimg/galleries/1921062212422944/06222021004252n54.jpg)
ఫజడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ
మల్యాల, జూన్ 21: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బంధీగా మారి రాష్ట్రంలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగు తోందని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ అన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు త థ్యమని ఆమె అన్నారు. బీజేపీలో చేరిన తరువాత సోమవారం కొండ గట్టు అంజన్నను ఆమె దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆ మె కక్ష పూరిత రాజకీయాలు చేస్తూ, ప్రశ్నించే వారిని టార్గెట్ చేయ డంతో పాటు ఉద్యమకారులను దూరం చేశారని విమర్శించారు. ఉద్య మం తెలియని వారిని పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆత్మగౌర వాన్ని తాకట్టుపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న సీఎం కేసీఆర్కు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణ పాఠం చెప్పడం ఖాయమన్నారు. కొండగట్టులో నేడు శ్రీ స్వామి వారిని ఈటల గెలుపొం దాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బింగి వేణు, నేరెళ్ల శ్రావణ్కుమార్, వనిత, రవి, పొన్నం మల్లేశంగౌడ్, రాజు, శ్రావ ణ్, గాజుల మల్లేశం, శ్రీనివాస్, చక్రంగౌడ్, రాజశేఖర్, హరీష్, తిరుపతి పాల్గొన్నారు