పీజీ సెట్‌లో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-25T05:50:53+05:30 IST

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయా ల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగేట్‌-21 ఫలితాల్లో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై. సత్యనారాయణ తెలిపారు.

పీజీ సెట్‌లో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ
విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌

జగిత్యాల అర్బన్‌, అక్టోబరు 24: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయా ల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగేట్‌-21 ఫలితాల్లో జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై. సత్యనారాయణ తెలిపారు. అత్యధికంగా వృక్షశాస్త్ర విభాగంలో 25 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించారని తెలిపారు. వీరిలో ఎస్‌ నస్రీన్‌ 40వ ర్యాంకు, సౌజన్య 79వ ర్యాంకు, శిరీష 91 ర్యాంకు, ఆకాంక్ష 100వ ర్యాంకు, శిల్పా 200వ ర్యాంకు, దేవి భవానీ 282 ర్యాంకు, మహీంభాను 309, శ్రావణి 352, అనూష 421, స్రవంతి 678, జ్యోతి 720, ఆకాంక్ష 874, రమ్యకృష్ణ 1352, అనూష 1356, శ్రావణి 1632, మేఘన 1753, ర్యాంకులు సాధిం చగా, ఎంఏ హిస్టరీలో జి.రమా 64వ ర్యాంకు, ఎంఏ తెలుగులో ఎన్‌ వని త 285 ర్యాంకు, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో ప్రియాంక 1744, ఎంఏ ఇంగ్లీషులో ఇందుమతి 910, ఎంఎస్సీ మ్యాథ్స్‌లో రాజమణి 1396,ఎం.కాంలో ఎం.వని త 1714 ర్యాంకులు రావడం పట్ల కళాశాల బృందం హర్షం వ్యక్తం చేశా రు. భవిష్యత్‌లో కళాశాల తరుపున మరిన్ని ర్యాంకులు సాధించేం దుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్ట ర్‌ మర్సూర్‌ సుల్తానా విద్యార్థులను అభినందించారు.


Updated Date - 2021-10-25T05:50:53+05:30 IST