డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులను నడపాలి
ABN , First Publish Date - 2021-01-25T06:08:20+05:30 IST
డ్రైవర్లు బస్సులను ఏకాగ్రతతో నడుపుతూ ప్రమాదాలను నివారించాలని టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఎ శ్రీధర్ అన్నారు.
ఆర్ఎం ఎ శ్రీధర్
భగత్నగర్, జనవరి 24: డ్రైవర్లు బస్సులను ఏకాగ్రతతో నడుపుతూ ప్రమాదాలను నివారించాలని టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ ఎ శ్రీధర్ అన్నారు. డ్రైవర్స్ డే సందర్భంగా కరీం నగర్ బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు ఆర్టీసీ సిబ్బంది భారీర్యాలీ నిర్వ హించారు. రోడ్లపై బస్సులను నడుపు తున్న ఆర్టీసీ, ఆటో, ద్విచక్రవాహన దారులకు గులాబీపూలు అందించి డ్రైవ ర్స్డే శుభాకాంక్షలు తెలిపారు. అనం తరం 2డిపోలో పదకొండుమంది ప్రమా దరహిత డ్రైవర్లను ఘనంగా సన్మానిం చారు. సీఐ విజయ్కుమార్, ఎంవీఐ నాగలక్ష్మి, డివిజినల్ మేనేజర్ ఎ రవిశంకర్రెడ్డి, డిపోమేనేజర్లు పి అర్పిత, ఎల్మల్లేశం, సూపర్వైజర్లు పాల్గొన్నారు.