ఉద్యమాల గడ్డను తాగుబోతులకు అడ్డగా మార్చారు: రేవంత్
ABN , First Publish Date - 2021-10-24T16:57:45+05:30 IST
తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కరీంనగర్: ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని, నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రేవంత్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర పరువును దిగజారుస్తున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలన్నారు. త్వరలో టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.