స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందుండాలి

ABN , First Publish Date - 2021-01-13T05:46:57+05:30 IST

సిరిసిల్ల పురపాలక సంఘాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉం దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందుండాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌

సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 12: సిరిసిల్ల పురపాలక సంఘాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉం దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్‌ వరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021 అవగాహన ర్యాలీని చైర్‌పర్సన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ తడి, పొడి చెత్త సేకరణలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సిరిసిల్ల పురపాలక సంఘం ప్రత్యేక గుర్తింపును పొందడంలో ప్రజలు, పాలకవర్గం, సభ్యులు, అధికారులు, పారిశుధ్య కార్మికుల సహ కారంతో సాధించగలుగుతున్నామన్నారు.  అనంత రం అక్కడే ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో వి జేతలకు ప్రోత్సాహక బహూమతులను అందజేశా రు. ఉత్తమ పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ సమ్మ య్య, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:46:57+05:30 IST