జగిత్యాలలో ఎల్ రమణ కీలక సమావేశం
ABN , First Publish Date - 2021-06-14T06:35:21+05:30 IST
పార్టీ మార్పుపై జగిత్యాలలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు.
అనుచరులతో సమాలోచనలు
రమణ సైకిల్ దిగి.....కారు ఎక్కనున్నారా..?
ఒకటి, రెండు రోజుల్లో రానున్న స్పష్టత
జగిత్యాల, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): పార్టీ మార్పుపై జగిత్యాలలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి రావాలన్న ఆహ్వానం మేరకు రమణ జరిపిన చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీ మార్పుపై కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ జరిపారు. కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కోసం కష్ట పడి ఎంత పనిచేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదని కార్యకర్తలతో రమణ అభిప్రాయం వెలిబుచ్చినట్లు ప్రచారం ఉంది. పార్టీ మారినప్పుడు ఎటువంటి పదవులూ ఆశించకూడదని, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల కోసమే అయితే టీఆర్ఎస్లో ఎప్పుడో చేరేవాడినని కార్యకర్తలతో రమణ అభిప్రాయాన్ని పంచుకున్నట్లు సమా చారం. రమణ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పలువురు అనుచరులు అభిప్రాయాలను వెలిబుచ్చి నట్లు తెలుస్తోంది. వచ్చే ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు అనుచర వర్గాలు అంటు న్నాయి. ఈవిషయమైన ‘ఆంధ్రజ్యోతి’ ఎల్ రమణను ఫోన్లో సంప్రదించగా అనుచరులు, ముఖ్య క్యాడర్తో భేటీ అయి నట్లు, పార్టీ మార్పు, ఇతర అంశాలు చర్చలోకి వచ్చాయని, అనుచరులు అభిప్రాయాల సేకరణ జరిపామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వ్యవహారం జగిత్యాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.