149 మందికి కొవిడ్ వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-19T05:51:44+05:30 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేంద్రాల ద్వారా 149 మంది ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి కొవీషీల్డ్ టీకా వే శారు. టీకాల ద్వారా ఇప్పటివరకు ఇబ్బందులు కలగలేదు.
సిరిసిల్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేంద్రాల ద్వారా 149 మంది ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి కొవీషీల్డ్ టీకా వే శారు. టీకాల ద్వారా ఇప్పటివరకు ఇబ్బందులు కలగలేదు. మరో మూడు రోజుల పాటు టీకాలు వేయడం కొనసాగనుంది. సోమవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ రాజేశం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కేంద్రంతోపాటు వేము లవాడ, తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రధాన ఆస్పత్రిలో విలేక రులతో మాట్లాడారు. టీకాతో ఎటాంటీ ఇబ్బందులు లేవని, ఎవరికైనా దు ష్ఫలితాలు కనిపిస్తే తక్షణమే చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశామని అ న్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.సుమన్మోహన్రావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ కపిలసాయి, డాక్టర్ మీనాక్షి ఉన్నారు.