రెండో డోసు తీసుకున్నాక కరోనా!
ABN , First Publish Date - 2021-02-26T15:46:44+05:30 IST
కరోనా మరోసారి విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రామగుండం

కరీంనగర్: కరోనా మరోసారి విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రామగుండం ఎన్టీపీసీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్కు, గోదావరి ఖని బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్న ఉద్యోగికి, అతడి భార్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగి రెండు సార్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకడంతో వైద్యులు ఖంగుతిన్నారు. వాసన కోల్పోడంతో బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. గత నెల 18న కరోనా వ్యాక్సిన్ వేయించుకోగా, రెండో డోస్ ఈనెల 18న వేసుకున్నాడు. మరోవైపు బ్యాంక్ మేనేజర్కు కరోనా సోకడంతో సంబంధిత అధికారులు బ్యాంక్ను మూసివేశారు. అదే విధంగా బ్యాంకులో ఉన్న ఉద్యోగికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బ్యాంక్లో కరోనా కలకలం రేపడంతో అటు సిబ్బందితో పాటు ఇటీవల బ్యాంకుకు వెళ్లిన వినియోగదారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా కరోనా భయం పట్టుకుంది. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయట ఇష్టానుసారంగా తిరగవద్దని సూచిస్తున్నారు.