తలనీలాల వేలానికి భారీ స్పందన

ABN , First Publish Date - 2021-01-21T04:42:51+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సంబంధించిన తలనీలాల వేలం ప్రక్రియకు భారీ స్పందన లభించింది.

తలనీలాల వేలానికి భారీ స్పందన
వేలం నిర్వహిస్తున్న అధికారులు, పాల్గొన్న కాంట్రాక్టర్లు

- రూ.64 లక్షల ఆదాయం సమకూరే అవకాశం

వేములవాడ, జనవరి 20 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి సంబంధించిన తలనీలాల వేలం ప్రక్రియకు భారీ స్పందన లభించింది. గతేడాది నవంబరు 25వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు 36 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి సమర్పించిన తలనీలాలను ఆలయ అధికారులు భద్రపరిచారు. వీటిని విక్రయించేందుకు ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 14 మంది కాంట్రాక్టర్లు పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన సుమిత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ కిలో ఒక్కంటికి 16 వేల 50 రూపాయల చొప్పున చెల్లించేందుకు అధికంగా పాట పాడి హక్కులు దక్కించుకుంది. తమ వద్ద సుమారు 400 కిలోల నిల్వ తలనీలాలు ఉన్నాయని, వీటి విక్రయం ద్వారా ఆలయ ఖజానాకు దాదాపు 64 లక్షల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉన్నదని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్‌, సూపరింటెండెంట్‌ బి.తిరుపతిరావు, సిబ్బంది నక్క తిరుపతి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:42:51+05:30 IST