బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై జీఎం కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-11-02T05:50:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు ఆధ్వర్యంలో ముట్టడించారు.

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై జీఎం కార్యాలయం ముట్టడి
ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీబీజీకేఎస్‌ నాయకులు

గోదావరిఖని, నవంబరు 1: కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, లేకపోతే టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో భవిష్యత్‌లో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో టీబీజీకేఎస్‌ నాయకులు కనకం శ్యామ్‌సన్‌, వడ్డేపల్లి శంకర్‌, యాదవరెడ్డి, పుట్ట రమేష్‌, నాయిని శంకర్‌, చెలుకలపెల్లి శ్రీనివాస్‌, దాసరి శ్రీనివాస్‌, మండ రమేష్‌, నర్సయ్య, ఎడవెల్లి రాజిరెడ్డి, బాలయ్య, కుశనపల్లి శంకర్‌, అప్పాల కృష్ణమూర్తి, మల్లారెడ్డి, స్వామిదాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T05:50:23+05:30 IST