మంత్రి హరీష్రావు పచ్చి అబద్ధాల కోరు: ఈటల
ABN , First Publish Date - 2021-10-04T20:29:15+05:30 IST
మంత్రి హరీష్రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కరీంనగర్: మంత్రి హరీష్రావుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ హరీష్రావు పచ్చి అబద్ధాల కోరని, మామకు (సీఎం కేసీఆర్) బానిసగా మారి.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం సహకారంతో ఈసారి కూడా వడ్లు కొంటామన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా.. ప్రచారం చేసినా.. కరెంట్ తీసేస్తున్నారని మండిపడ్డారు. గన్మెన్లను తగ్గించారని, ఒకే గన్మెన్ను ఇచ్చారన్నారు. తనపై సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు అనుమానం వస్తోందని ఈటల రాజేందర్ అన్నారు.