ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-12T05:58:24+05:30 IST

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ అధ్యక్షతన సోమ వారం కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

కోనరావుపేట, జనవరి 11 : ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌ అధ్యక్షతన సోమ వారం కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.  కొంత మందికి రైతుబంధు డబ్బులు పడడం లేదని పలువురు ప్రజాప్రతినిధులలు సభ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు. సభదృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే రమేష్‌ బాబు, మంత్రి కేటీఆర్‌ సహకారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  సెస్‌ డైరెక్టర్‌ దేవరకొండ తిరుపతి, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీశక్ష రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ తసుమలత తదితరులు పాల్గొన్నారు.


సర్పంచులకు విలువ లేకుండా పోతోంది.. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సర్పంచులకు విలువ లేకుండా పోతోందని ధర్మారం సర్పంచ్‌ గున్నాల అరుణ లక్ష్మణ్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. అధి కారులు అధికార పార్టీ నేతలకే సహకరిస్తున్నారని ఆరోపించారు.  పూర్త యిన పనులకు  ఉపసర్పంచ్‌ చెక్కులపై సంతకం పెట్టడం లేదని మహిళా సర్పంచ్‌నని చూడకుండా దుర్భాషలాడారని  పేర్కొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, ఎంపీడీవో రామకృష్ణ సదరు ఉపసర్పంచ్‌పై తప్పులు ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నా సర్పంచ్‌ సభను బహిష్కరించారు. 

Updated Date - 2021-01-12T05:58:24+05:30 IST