స్కూటీ డిక్కీలో నాగుపాము

ABN , First Publish Date - 2021-08-25T06:30:08+05:30 IST

వర్షాకాలంలో గ్రామాల్లో పాముల భయం వెంటాడుతుంది. చెట్లపొదలు, పుట్టల్లోకి నీరు చేరడంతో ఇళ్లలోకి చేరి భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇంటి ఆవరణలోని కార్లు, బైకు ల్లోకి దూరుతాయి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్కూటీడిక్కీలో నాగుపాము హడలెత్తించింది.

స్కూటీ డిక్కీలో నాగుపాము
పామును పడుతున్న ఫ్రెండ్స్‌ ఫర్‌ స్నేక్‌ సొసైటీ సభ్యుడు

తంగళ్లపల్లి, ఆగస్టు 24:  వర్షాకాలంలో గ్రామాల్లో పాముల భయం వెంటాడుతుంది. చెట్లపొదలు, పుట్టల్లోకి నీరు చేరడంతో ఇళ్లలోకి చేరి భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఇంటి ఆవరణలోని కార్లు, బైకు ల్లోకి దూరుతాయి. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్కూటీడిక్కీలో నాగుపాము హడలెత్తించింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామానికి చెందిన సిలివేరి పోచయ్య అనే రైతు ఇంటి ఎదుట పార్క్‌ చేసిన స్కూటీ డిక్కీలో నుంచి పాము బుసకొట్టే శబ్ధం వినిపించింది. అనుమానం వచ్చిన పోచయ్య మెల్లగా డిక్కీ తెరిచాడు. అందులో నాగుపాము కనిపించడంతో హడలెత్తిపోయాడు. వెంటనే స్కూటీ సీటును క్లోజ్‌ చేశాడు. ఫ్రెండ్స్‌ ఫర్‌ స్నేక్‌ సొసైటీ సభ్యులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సభ్యులు డిక్కీలోని పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 

Updated Date - 2021-08-25T06:30:08+05:30 IST