ఈవీఎంల గోదామును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

ABN , First Publish Date - 2021-12-31T05:41:03+05:30 IST

ఎలక్షన్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాడ్‌ లను భద్రపరిచే గోదామును రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ప్రారం భించారు.

ఈవీఎంల గోదామును ప్రారంభించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
ఈవీఎంల గోదామును ప్రారంభిస్తున్న శశాంక్‌ గోయల్‌

పెద్దపల్లి, డిసెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఎలక్షన్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీ ప్యాడ్‌ లను భద్రపరిచే గోదామును రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ ప్రారం భించారు. గురువారం ఆయన పెద్దపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కు అదనపు కలెక్టర్లు వి లక్ష్మీనారాయణ, కుమార్‌ దీపక్‌లు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగ తం పలికారు. పెద్దపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఈ గోదామును నిర్మించారు. ఈ సందర్భంగా ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా నిర్వ హించేందుకు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఉపయోగపడుతున్నాయన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ఖర్చు లేకుండా, త్వరితగతిన కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఈ యంత్రాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ యంత్రాలు చెడిపోకుండా కాపాడేందుకు ప్రత్యే కంగా ఒక గోదాము అవసరమన్నారు. అందులో భాగంగా ఇక్కడ కొత్తగా నిర్మించిన గోదాములో యంత్రాలను భద్రపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పులిగిళ్ల రవీందర్‌, తహసీల్దార్‌ డి శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ తూము రవీందర్‌, ఎన్నికల విభాగం డీటీ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:41:03+05:30 IST