బస్సే.. బస్టాండు
ABN , First Publish Date - 2021-04-20T05:34:56+05:30 IST
వేసవిలో ప్రయాణికులకు నీడ కల్పించేం దుకు ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు.
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 19: వేసవిలో ప్రయాణికులకు నీడ కల్పించేం దుకు ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. జిల్లా కేంద్రంలోని ధర్మపు రి రోడ్లో గల మిషన్ కాంపౌండ్లో ప్రయాణ ప్రాంగణం లేకపోవడంతో ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ డీఎం జగదీష్ రిక్వెస్ట్ బస్స్టాప్ వద్ద ఓ పాత బస్ను బస్షెల్టర్గా ఏర్పాటు చే శారు. ఇందులో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచారు. డీఎం జగదీష్ మాట్లాడుతూ ప్రయాణి కుల సంక్షేమమే ప్రధాన ధేయమన్నారు.