ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-04-11T06:10:48+05:30 IST
కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేష్ పేర్కొన్నారు
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 10: కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేష్ పేర్కొన్నారు.కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రాజేష్ పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజలకు వాటర్ బాటిళ్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం పీహెచ్సీ సెంటర్ ఎదుట ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వారికి సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరబత్తిని అనిల్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు నక్క జీవన్, నాయకులు సాయికృష్ణ, ఉత్తమ్, శ్రీనివాస్, పవన్, రమేష్, విజయ్ తదితరులున్నారు.