HYD: వైఎస్సార్టీపీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళన
ABN , First Publish Date - 2021-07-31T18:52:51+05:30 IST
నగరంలోని లోటస్ పాండ్ వైఎస్సార్టీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్ వైఎస్సార్టీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి నేతలు నిరసన చేపట్టారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలను వేయాలని అసంతృప్తి నేతలు డిమాండ్ చేశారు. కార్యకర్తల నిరసనల నేపథ్యంలో లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.