కాసేపట్లో గవర్నర్ను కలువనున్న టీపీసీసీ బృందం
ABN , First Publish Date - 2021-02-26T13:47:07+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం ఈరోజు భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ను టీపీసీసీ అధ్యక్షులు

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం మరికాసేపట్లో భేటీ కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, ముఖ్య నేతలు కలువనున్నారు. ఈ సందర్భంగా మంథనిలో హైకోర్టు న్యాయవాదుల జంట వామనరావ్, నాగమణిల దారుణ హత్యలపై గవర్నర్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ బృందం కోరనుంది.