11:30 గంటలకు డీజీపీని కలువనున్న టీపీసీసీ బృందం
ABN , First Publish Date - 2021-02-26T15:34:19+05:30 IST
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డితో టీపీసీసీ బృందం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు భేటీకానుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డితో టీపీసీసీ బృందం ఈ రోజు ఉదయం 11:30 గంటలకు భేటీకానుంది. ఈ సందర్భంగా మంథనిలో హైకోర్టు న్యాయవాదుల జంట వామనరావ్, నాగమణిల దారుణ హత్యలపై సమగ్ర దర్యాప్తునకు డీజీపీకి నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు. అంతకు ముందు ఉదయం ఇదే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసైను కలిసిన టీపీసీసీ నేతలు న్యాయవాదుల జంట హత్యపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు.