దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు: నిరంజన్

ABN , First Publish Date - 2021-10-07T19:26:38+05:30 IST

దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు.

దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు: నిరంజన్

హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు విలువ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖిమపూర్‌లో రైతులపై బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కార్‌తో తొక్కించి నలుగురు రైతులను చంపేశారని మండిపడ్డారు. నిన్న ఆత్మకూరులో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మహిళలు బతుకమ్మ ఆడుతుంటే కారుతో బతుకమ్మలను తొక్కించి అవమాన పరిచారన్నారు. మహిళలంటే టిఆర్ఎస్‌కు అంత అలుసు అయ్యిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని... అక్కడి సీఐపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరకాల ఘటనపై గవర్నర్ స్పందించి విచారణ జరిపి ఎమ్మెల్యే, సీఐలపైన చర్యలు తీసుకోవాలని నిరంజన్ అన్నారు. 

Updated Date - 2021-10-07T19:26:38+05:30 IST