కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిందే: టీ.హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-31T18:14:33+05:30 IST

కరోనా, ఒమైక్రాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సిందే: టీ.హైకోర్టు

హైదరాబాద్: కరోనా, ఒమైక్రాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు  తెలిపారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు... ఈ నెల 21, 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లెన్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలోఒమైక్రాన్ పరిస్థితులపై జనవరి 3లోపు కోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు జనవరి 4కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-31T18:14:33+05:30 IST