కొవిడ్ కష్ట కాలంలో ప్రజల వెంటే పోలీస్‌శాఖ: డీజీపీ Mahendar

ABN , First Publish Date - 2021-12-31T18:33:32+05:30 IST

2021లో కోవిడ్ కష్టకాలంలో పోలీస్ శాఖ ప్రజల వెంటనే ఉందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

కొవిడ్ కష్ట కాలంలో ప్రజల వెంటే పోలీస్‌శాఖ: డీజీపీ Mahendar

హైదరాబాద్: 2021లో కోవిడ్ కష్టకాలంలో పోలీస్ శాఖ ప్రజల వెంటనే ఉందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసి కొవిడ్ వారియర్స్‌గా పని చేశామని తెలిపారు. 2020, 2021లో తెలంగాణ పోలీస్ శాఖకు ఒక మంచి పేరు వచ్చిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు రాష్ట రహిత రాష్టంగా పోలీస్ శాఖ సఫలీకృతం అయిందన్నారు. 2021 సంవత్సరంలో  రాష్ట్రంలో మావోయిస్టులు అడుగులు పెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నామని అన్నారు. 98 మావోయిస్టులను అరెస్ట్ చేశామని, దాదాపు 133 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. 8 ఫైర్ ఆమ్స్ క్యాష్ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-31T18:33:32+05:30 IST