తెలంగాణలో 6,361 కరోనా కేసులు..51 మరణాలు
ABN , First Publish Date - 2021-05-05T16:21:15+05:30 IST
రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 51మంది మృతి చెందారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 51 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 2,527కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 3,89,491 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,225 కరోనా కేసులు నమోదు అయ్యాయి.