చాదర్ఘాట్ కాజ్ వే బ్రిడ్జి వద్ద నాగుపాము కలకలం
ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST
చాదర్ఘాట్ కాజ్ వే బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం నాగుపాము కలకలం రేపింది.
చాదర్ఘాట్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): చాదర్ఘాట్ కాజ్ వే బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం నాగుపాము కలకలం రేపింది. బ్రిడ్జికి ఇరువైపులా చెత్తాచెదారం తొలగించడంతోపాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు పనులు జరుగుతుండడంతో మూసీలో ఉన్న నాగుపాము బయటికి వచ్చి కాజ్ వే బ్రిడ్జిపై కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాగుపాము అక్కడి నుంచి బ్రిడ్జి కిందకు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రెండు, మూడు సార్లు కనిపించి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు.