Shamshabad Airportలో 472.8 గ్రాముల బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-12-01T14:28:48+05:30 IST
గౌహతి నుంచి ఇండిగో విమానంలో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా అతడి వద్ద 472.8 గ్రాముల బంగారం పట్టుబడింది.
హైదరాబాద్/శంషాబాద్: గౌహతి నుంచి ఇండిగో విమానంలో మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్న ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా అతడి వద్ద 472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. దీని విలువ రూ.23.33 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా వారం రోజులుగా విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతుండడం గమనార్హం.