తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ఐపీఎస్ల కేటాయింపు
ABN , First Publish Date - 2021-01-21T00:03:37+05:30 IST
దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్లకు కేంద్రం పోస్టింగులు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 150 మంది ఐపీఎస్లకు కేంద్రం పోస్టింగులు ఇచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ఐపీఎస్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణకు నలుగురు, ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు ఐపీఎస్లు కేటాయించింది. తెలంగాణకు పరితోష్ పంకజ్, సిరిశెట్టి సంకీత్, పాటిల్ కాంతిలాల్, అంకిత్ కుమార్ కేటాయించగా, ఆంధ్రప్రదేశ్కు అడహల్లి, పంకజ్ కుమార్, ధీరజ్ కునుబిల్లిని కేంద్రం కేటాయించింది.