టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుంది: సంపత్ కుమార్
ABN , First Publish Date - 2021-12-28T20:29:20+05:30 IST
టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కోల్పోతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మతి తప్పి కాంగ్రెస్పై మాట్లాడుతున్నారని, కాంగ్రెస్పై విమర్శలు మానుకొకపోతే తమ కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో వరి వేశారన్న రేవంత్ రెడ్డి మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. దాన్ని నిరూపించేందుకు తాము సిద్ధమని, టీఆర్ఎస్ నేతలు సిద్దమా? అని సవాల్ చేశారు. వాస్తవాలు బయట పడతాయనే ఎర్రవెల్లి రచ్చబండకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. రెండు రోజుల సమయం ఇస్తున్నామని, వాస్తవాలను చర్చించేందుకు టీఆర్ఎస్ బహిరంగ చర్చకు రావాలన్నారు.