Teenmar Mallanna ను విడుదల చేయకపోతే.. : ఆర్ కృష్ణయ్య వార్నింగ్
ABN , First Publish Date - 2021-09-02T20:16:05+05:30 IST
తీన్మార్ మల్లన్నను విడుదల చేయకపోతే..
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : తీన్మార్ మల్లన్నపై పెట్టిన బోగస్ కేసులు ఉపసంహరించుకోవాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలనే అంశంపై సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. మల్లన్న వెలికి తీసిన మంత్రులు, శాసనసభ్యులు చేస్తున్న వందల కోట్ల కుంభకోణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తీన్మార్ మల్లన్నను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో 14 బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కె.నర్సింహగౌడ్, ఎర్ర సత్యనారాయణ, నీలం వెంకటేష్, అల్లంపల్లి రామకోటి, చంద్రవంక చిన్న రాములు, జిల్లపల్లి అంజి, గొరిగే మల్లే్షయాదవ్, బర్క కృష్ణ, టీఆర్ చందర్, ఉపేందర్గౌడ్, సుచిత్కుమార్, సి.రాజేందర్, మధుసూదన్, ఎస్. వెంకన్న పాల్గొన్నారు.