Phonepe లో స్ర్కాచ్ కార్డులు వచ్చాయని మెసేజ్.. క్లిక్ చేసి చేయగా...!
ABN , First Publish Date - 2021-10-07T17:07:23+05:30 IST
ఫేస్బుక్లో శోధిస్తుండగా ఫోన్ పే స్ర్కాచ్ కార్డులు వచ్చాయని సందేశం వచ్చింది....
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : స్ర్కాచ్ కార్డుల కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకుల ఖాతాలో నగదు మాయమైంది. బాపునగర్కు చెందిన నరేందర్రెడ్డి ఫేస్బుక్లో శోధిస్తుండగా ఫోన్ పే స్ర్కాచ్ కార్డులు వచ్చాయని సందేశం వచ్చింది. కార్డులను స్ర్కాచ్ చేయగా ఫోన్ పే యూపీఐ ఐడీ నమోదు చేయాలని రావడంతో నమోదు చేశాడు. దీంతో అతడి ఖాతా నుంచి రూ. 2 వేలు మాయమయ్యాయి.
మరో ఘటనలో..
ఎస్ఆర్నగర్కు చెందిన ఉపేందర్రెడ్డి, హరికిషన్రెడ్డి స్నేహితులు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ నంబర్ కోసం హరికిషన్రెడ్డి ఉపేందర్రెడ్డి సెల్ఫోన్ తీసుకుని గూగుల్లో శోధించాడు. అందులో లభించిన ఓ నంబర్కు ఫోన్ చేయగా స్పందన రాలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్కాల్ వచ్చింది. రెండు స్ర్కాచ్ కార్డులు వచ్చాయని చెప్పడంతో వాటిని స్ర్కాచ్ చేసి యూపీఐ ఐడీ నమోదు చేశాడు. వెంటనే అతడి ఖాతా నుంచి రూ. 2 వేలు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.