Osmania University లో సమాధి కలకలం.. పోలీసులు ఏం తేల్చారంటే..!
ABN , First Publish Date - 2021-11-30T15:43:59+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వసతి గృహం వెనుక..
- శునకాన్ని పూడ్చారని నిర్ధారించిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/తార్నాక : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వసతి గృహం వెనుక భాగంలో సమాధి కలకలం రేగింది. రోజూ మాదిరిగా సోమవారం ఉదయం వాకింగ్కు వెళ్ళిన ఓయూ విద్యార్థులు సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాధిని పరిశీలించారు. ఓయూ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తీకి చెందిన వ్యక్తి పెంపుడు కుక్క చనిపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఈసీహెచ్-1 వసతి గృహం సమీపంలో పూడ్చిపెట్టాడు. సమాధి వద్ద ఉన్న ఆనవాళ్ళతో పాటు, ప్రత్యక్ష సాక్షిని విచారించిన అనంతరం దానిని కుక్క సమాధిగా నిర్ధారించామని ఓయూ సీఐ రమేష్ నాయక్ తెలిపారు. దీంతో ఓయూ విద్యార్థులతో పాటు, వాకర్స్ ఊపిరి పీల్చుకున్నారు.