మైహోమ్.. మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఎంపీ అరవింద్
ABN , First Publish Date - 2021-01-15T21:29:13+05:30 IST
మైహోమ్... మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. శుక్రవారం సీఎస్తో ఎంపీ సమావేశమయ్యారు.
హైదరాబాద్: మైహోమ్... మైనింగ్ చట్టాలను దుర్వినియోగం చేస్తోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. శుక్రవారం సీఎస్తో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మైహోం వంటి కంపెనీలకు ప్రభుత్వం మళ్లీ 600 ఎకరాలు కేటాయించడం సరికాదన్నారు. అక్రమ మైనింగ్ ఆపకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కొత్త చట్టాలతో దళారుల వ్యవస్థ లేకుండా పోతుందన్నారు. కోల్డ్ స్టోరేజీల నిర్వహణకు కేంద్రం లక్ష కోట్ల నిధులు ఇస్తోందని... ఈ స్కీమ్ నిధులను తెలంగాణ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు.