నేటి నుంచే ఉచిత నీరు..

ABN , First Publish Date - 2021-01-12T12:31:51+05:30 IST

గృహ కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల నీళ్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించనున్నారు.

నేటి నుంచే ఉచిత నీరు..

హైదరాబాద్‌: గృహ కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల నీళ్లను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు రెహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్‌లో వాటర్‌బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. వినియోగదారులకు డిసెంబర్‌ నెలకు సంబంధించిన జీరో నీటి బిల్లులను అందివ్వనున్నారు. అధికంగా నీళ్లను వాడుకున్న వారికి 20 వేల లీటర్లను మినహాయించి బిల్లులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.


Updated Date - 2021-01-12T12:31:51+05:30 IST