Lotuspand రూపు రేఖలు మారిపోయాయ్...!

ABN , First Publish Date - 2021-08-21T15:35:27+05:30 IST

లోటస్‌పాండ్‌ కొత్త రూపు సంతరించుకుంది....

Lotuspand రూపు రేఖలు మారిపోయాయ్...!

  • అబ్బురపరిచేలా అభివృద్ధి 
  • అభినందించిన మంత్రి


హైదరాబాద్‌ సిటీ : బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని లోటస్‌పాండ్‌ కొత్త రూపు సంతరించుకుంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నీటి స్వచ్ఛత కోసం ఏరేటర్లు, సందర్శకులను ఆకట్టుకునేలా నీటి మధ్యలో ఐ ల్యాండ్స్‌ (ఫ్లోటింగ్‌ ఐ ల్యాండ్స్‌) ఏర్పాటు చేశారు. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌తోపాటు.. సుందరవనంగా మారిన తీర ప్రాంతంలో సందర్శకులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దీపాలు.. లోటస్‌పాండ్‌‌కు అదనపు సొబగులు అద్దాయి. ఎమ్మెల్యే కాలనీలో జరిగిన కొలను అభివృద్ధి ఫొటోలను జోనల్‌ కమిషనర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా కేటీఆర్‌ స్పందించారు. గ్రేట్‌ జాబ్‌.. ఇలాంటివి మరిన్ని చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు.



Updated Date - 2021-08-21T15:35:27+05:30 IST