చిలుకానగర్ శ్మశానవాటికలో కరోనా మృతుల అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-04-22T06:20:29+05:30 IST
చిలుకానగర్ హిందూ శ్మశానవాటికలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఆందోళన.. అభ్యంతరం
ఉప్పల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): చిలుకానగర్ హిందూ శ్మశానవాటికలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగరంలో పలుచోట్ల, ఆస్పత్రుల్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను చిలుకానగర్ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తుండడంతో న్యూ రాంనగర్, ఆదర్శనగర్ వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు. శ్మశానవాటికలో స్థానికుల అంత్యక్రియలు తప్ప ఇతర ప్రాంతాల వారి అంత్యక్రియలు నిర్వహించరాదని జీహెచ్ఎంసీ అధికారులకు, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్కు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్ శ్మశానవాటికను సందర్శించి ఇతర ప్రాంతాలకు చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించవద్దని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.