HYD: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-12-25T17:22:48+05:30 IST
నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
![HYD: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెల్లార్ నీటి గుంతలో పడి మృత్యువాతపడిన చిన్నారుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. చిన్నారి సోఫియా తల్లిని పోలీసులు వారి వాహనంలో ఎక్కించి తరలించారు. బంధువులు స్టేషన్ ముందు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.